కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ...గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి...
కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ
గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జున్ కుటుంబాన్ని కలిసిన మంత్రి లోకేష్
ధైర్యంగా ఉండాలని,జీవితాంతం అండగా ఉంటానని భరోసా
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పు డు,ఏ ఆపద వచ్చినా అండగా నిలిచే మంత్రి నారా లోకేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.గతేడాది కర్నూలు జిల్లా,నన్నూరు వద్ద మునగాలపాడు గ్రామా నికి చెందిన టీడీపీ కా ర్యకర్త ఎమ్.అర్జున్ అనే యు వకుడు విద్యుత్ షాక్ కు గురై మృతిచెందాడు.ఈ నేపథ్యంలో అర్జున్ కుటుంబ సభ్యులను మంగళగి రిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మం త్రి పిలిపించారు.దివంగత అర్జున్ తల్లిదండ్రులు మ స్టిక్ మద్దిలేటి,రాణితో పాటు సోదరి కోమలితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అర్జున్ మరణం బాధించిందని చె ప్పారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అర్జున్ సోదరి కోమలి చదువు వివరాలను అడిగి తెలుసుకు న్నారు.కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని,జీ వితాంతం అండగా ఉంటానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.తమ కుటుంబానికి అండగా నిలవడం పట్ల మంత్రి నారాలోకేష్ కు అర్జున్ కుటుంబ సభ్యులు ధ న్యవాదాలు తెలిపారు.
Comments
Post a Comment