మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం...దాడి చేసిన వారిపై పిడి యాక్ట్ పెట్టాలి...మచ్చ రామలింగారెడ్డి,APWJU...
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాందాడి చేసిన వారిపై పిడి యాక్ట్ పెట్టాలిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి కఠినచర్యలు తీసుకోవాలిమచ్చా రామలింగారెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్
మహా న్యూస్ కార్యాలయంపై రా జకీయ పార్టీలు దాడి చేయడం మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి గానే భావిస్తున్నామని ప్రజాస్వా మ్యంలో ఇది మాయని మచ్చ అని దాడుల ద్వారా మీడియాని తమ ఆధీనంలో తీసుకోవాలని చూస్తే తిరుగుబాటు తప్పదని ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంక టేశులు,ఆనంతపురం జిల్లా కార్యదర్శి విజయరాజు శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.దాడి చేసిన వారిపై పీడి యాక్ట్ ప్రయోగించాలని,భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావత్వం కాకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మచ్చా రా మలింగారెడ్డి అన్నారు.తన 30 ఏళ్ల జర్నలిస్టు ఉద్యమంలో అనేక పోరాటాలు చేశామని, ఇటువంటి దుర్మార్గమైన సంఘటన గతంలో ఎప్పుడూ చూడలేదని,ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని అన్నారు.రాజకీయ పార్టీలు తమ తీరును మార్చుకోవాలని సూచిం చారు.ప్రజాస్వామ్య దేశంలో నిజాన్ని నిర్భయంగా సమాజానికి చూపించే మీడియాను కట్టడి చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఈలాంటి దాడులు,రాజకీయ పార్టీలు భయ బ్రాంతులకు గురిచేయడం మీడియా స్వేచ్ఛను కాలరాయాలని చూస్తే ప్రజలు ఇలాంటి వా ళ్లను రాజకీయంగా భూస్థాపితం చేసే దానికి సిద్ధంగా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి.ప్రతి విషయాన్ని నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళేది మీడియా,అలాంటి మీడియా పై,కార్యాల యాలపై దాడి చేయడం క్షమించరాని నేరం.ఈలాంటి వారిపై క్రిమినల్ కేసు లు పెట్టి ప్రజాస్వామ్యాన్ని మీడియా స్వేచ్ఛను బతికించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Post a Comment