కన్నీటితో కాలం గడుపుతున్నా...అసెంబ్లీ రౌడీతో చిత్ర పరిచయం...పూట గడవని దీన స్థితిలో నటి పాకీజా...
కన్నీటితో కాలం గడుపుతున్నాఅసెంబ్లీ రౌడీతో చిత్ర పరిచయంతమిళనాడులో ఆదరణ కరువుపూట గడవని దీన స్థితిలో నటి పాకీజా
VS9TV న్యూస్,గుంటూరు ప్రతినిధి :
తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం లేని పేరు కాదు వాసుగి.తనదైన హావభావాలతో,సమయోచి త కామెడీ టైమింగ్తో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకు లను ఆకట్టుకున్న ఆమె,నేడు జీవిత పోరాటంలో క న్నీటితో కాలం గడుపుతున్నారు.ముఖ్యంగా 1991 లో వచ్చిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రంలో 'పాకీజా' అనే పాత్ర ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.కానీ ఆ తరువాత కాలంలో ఆమెకు అవ కాశాలు తగ్గిపోవడం,కుటుంబ పరిస్థితులు కుదుటపడక పోవడంతో నిత్యం పోరాటమే జీవితం అయ్యింది.ప్రస్తుతం పూట గడవని దీనస్థితిలో కొన్నిసార్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.తమిళనాడులో ఆదరణ కరువవడంతో ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుం టుందన్న ఆశతో ఇక్కడికి వచ్చారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీసి :
చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వాసుగిని గుంటూరులో మీడి యా ప్రతినిధులు పలకరించారు.ఈ సందర్భంగా ఆమె తన ప్రస్తుత దుర్భర పరిస్థితిని వివరి స్తూ భావోద్వేగానికి గురయ్యారు.'తమిళనాడులో నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీ సి ఎందరో నటులకు పంపినా ఎవరూ స్పందించలేదు.కానీ తెలుగు సినీ పరిశ్రమలోని చి రంజీవి,నాగబాబు,మోహన్ బాబు కుటుంబాలు నన్ను ఆదుకున్నాయి.ఒకవేళ వారు కూ డా ఆదుకోకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని' అని ఆమె తెలిపారు.వాసుగి స్వస్థలం తమిళనాడులోని కారైకుడి.
కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు :
మోహన్బాబు హీరోగా వచ్చిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రంలో పాకీజా పాత్ర ఆమెకు ఎనలేని గు ర్తింపును తెచ్చిపెట్టింది.ఆ తర్వాత 'రౌడీగారి పెళ్లాం', 'పెదరాయుడు', 'అన్నమయ్య' వం టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు అప్పటి తమిళనాడు సీఎం జయలలిత పిలుపు మేరకు ఆమె అన్నాడీఎంకే పార్టీలో చేరి రాజకీ యాల్లోకి అడుగుపెట్టారు.అప్పటినుంచి క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.
జయలలిత తర్వాత తనను పట్టించుకునేవారే కరువు :
రాజ్కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన జీవితంలో కష్టాలు మొదలయ్యాయని వాసుగి వాపోయారు.అత్తమామల వేధింపులు,భర్త మద్యానికి బానిసై ఆస్తులు కరిగించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.కొంతకాలానికి భర్త ఆ త్మహత్య చేసుకోవడంతో అత్తమామలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె కన్నీళ్లతో చెప్పారు.ఉన్న కొద్దిపాటి డబ్బును క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి చికిత్స కోసం ఖర్చు చే శానని వివరించారు.తన రాజకీయ గురువైన జయలలిత మరణం తర్వాత తనను పట్టిం చుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నన్ను ఆదుకోవాలి :
తెలుగువారే నాకు అన్నం పెట్టారు.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నన్ను ఆదు కోవాలి.సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి నా గోడు వెల్లడించు కోవాలని ఉంది.నాకు ఒక పింఛన్ సౌకర్యం కల్పిస్తే బతికినంత కాలం వారి పేరు చెప్పు కుని జీవిస్తాను.అవసరమైతే వారి కోసం ఊరూరా తిరిగి ప్రచారం కూడా చేస్తాను' అని వాసుగి విజ్ఞప్తి చేశారు.

Comments
Post a Comment