మత్స్యశాఖ మహిళా అధికారిపై రూ.48 లక్షల మోసం కేసు నమోదు...

మత్స్యశాఖ మహిళా అధికారిపై 

రూ.48 లక్షల మోసం కేసు నమోదు

VS9TV న్యూస్,విజయవాడ :
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని,అధిక లాభాలు ఇస్తానని చెప్పి చిన్ననాటి స్నేహితురాలిని రూ.48లక్షలకు మోసం చేసిన కేసులో గుంటూరు మత్స్యశాఖ సూపరింటెండెంట్ నిమ్మ కాయల లలిత కుమారిపై అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నిందితు రాలితో పాటు ఆమె భర్త జాన్సన్‌పై కూడా మోసం, నమ్మక ద్రోహం,క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు.డబ్బు తిరిగి అడిగితే బాధితురాలిని చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.బాధితురాలు నంద మూరి నగర్,విజయవాడకు చెందిన షేక్ షమీమ్ (50).ఆమె ఫిర్యాదు మేరకు,నిమ్మకా యల లలిత కుమారి చిన్ననాటి స్నేహితురాలు కాగా,గుంటూరు మత్స్య శాఖలో సూప రింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.లలిత కుమారికి ఉన్నతాధికారులతో పరిచయాలు ఉ న్నాయని,తమ కుమార్తెకు మత్స్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 23,సెప్టెంబర్‌లో రూ.20లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.తర్వాత లలితకు మారి తన భర్త,అల్లుడికి విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని,పాస్టరల్ పనుల కోసం అ త్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి మరో రూ.28లక్షలను హ్యాండ్ లోన్‌గా తీసుకున్నా రని బాధితు రాలు పేర్కొన్నారు.అవసరమైతే మొత్తం కోటి తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన ట్లు చెప్పారు.తరచూ ఉద్యోగం,డబ్బు రీ పేమెంట్ గురించి అడిగినప్పుడు సరైన సమాధా నాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని,చివరకు చంపేస్తామని బెదిరించ డంతో పోలీసు లను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో ఉంది.ఈ కేసులో బ్యాంకు లావాదేవీలు,ఇతర కుటుం బ సభ్యుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Comments