మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం...ఎం.డి.ఆనంద్ బాబు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు...
మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వంఎం.డి.ఆనంద్ బాబు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.నవంబర్ 23,24వ తేదీలలో కర్నూలు మండల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కర్నూలు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి హుస్సేనయ్య అధ్యక్షతన జీవుజాత కార్య క్రమం చేపట్టారు.జీపు జాత ప్రారంభం సందర్భంగా దేవమాడ గ్రామంలో ఆదివారం సిపి ఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు ఎం.డి.ఆనంద్ బాబు జెండా ఊపి ప్రారంభించారు.అ నంతరం ఆనంద్ బాబు మాట్లాడుతూ కర్నూలు మండలాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.గత ప్రభుత్వంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్ర భుత్వంలోనైనా పరిష్కారం అవుతాయని విశ్వసించారని అన్నారు.కానీ నేటికీ ఆ సమస్య లు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు.ప్రభు త్వం ఏర్పడి 17నెలలైనా ఇప్పటికీ ఆర్కే దుద్యాల గ్రామానికి,ఎదురూరు,తొలిషాపురం గ్రా మాలకు రోడ్లు వేయలేదన్నారు.ఆర్కే దుద్యాల,గొందిపర్ల గ్రామలలో డ్రైనేజీ వ్యవస్థ లేక అ స్తవ్యస్తంగా ఉందన్నారు.తొలిసాపురం గ్రామంలో ఉప్పునీటిని తాగాల్సిన పరిస్థితి ఉంద న్నారు.వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవడానికి ప్రకటించిన హెక్టర్ కు రూ.50వేలు ఇప్పటికి అందచేయ కపోవడంతో రైతులు ఎంతో ఆవేదనతో ఉన్నారని తెలియజేశారు.ఉల్లి రైతులను ఆదుకో వడం కోసం ప్రభుత్వం చేస్తామన్న సహాయం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ పూర్తి చేసి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన సిపిఎం చేపడు తుందని హెచ్చరించారు.అనంతరం గొందిపర్ల, తాండ్రపాడు,పంచలింగాల,నిర్జూరు,సింగవరం,ఎదురూరు,తొలిసాపురం,ఆర్కే దుద్యాల, కొంతలపాడు,సుంకేసుల,ఉల్చాల వరకు జీపు జాత కొనసాగించారు.ఈ జీపు జాత కా ర్యక్రమంలో మండల నాయకులు రాఘవేంద్ర,శ్రీరాములు,బాలపీరా,ఆంజనేయులు,మధు, హరి,కిషన్ రెడ్డి,వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment