టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొ డిచి చంపిన భార్య...

టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు
భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

VS9TV న్యూస్,మంగళగిరి :
ఏపీ–మంగళగిరి మండలం,పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశా యి.టీవీ సౌండ్ తగ్గించమన్న విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసిం ది.పోలీసుల సమాచారం ప్రకారం...పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మె కానిక్‌గా పనిచేస్తున్నాడు.ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది.అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి నివసి స్తున్నారు.క్రాంతికి గతంలోనే వివాహం కాగా,ఆమె భర్త ఓ నేరంలో జైలులో ఉన్నట్టు తెలు స్తోంది.ఆ తరువాత షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది.ఇంట్లో టీవీ సౌండ్ త గ్గించమన్న అహ్మద్‌తో క్రాంతికి వాగ్వాదం జరిగింది.ఆగ్రహంతో క్రాంతి కత్తితో అహ్మద్‌ ను పొడిచినట్టు సమాచారం.తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థ లికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.క్రాంతిని అదుపులోకి తీసుకు ని విచారణ కొనసాగిస్తున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments