హైదరాబాద్ లో ప్రేయసి ఆత్మహత్య...విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు...
హైదరాబాద్ లో ప్రేయసి ఆత్మహత్య
విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు
విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యు వకుడు అనుమానస్పద మృతి కలకలం రేపిం ది...మృతుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్యామ్ కుమార్ గా గుర్తించారు. మద్యంలో పాయిజన్ కలుపుకుని యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే,నా చావుకు ఎవరూ కారణం కాదు.. సారీ అమ్మ..అంటూ రాసిన సూసైడ్ నోట్ లభిం చింది.ప్రేమించిన యువతి పావనితో గొడవే చావుకు కారణంగా తెలుస్తుంది.హైదరాబాద్ లో శ్యామ్ కుమార్,పావని మద్య జరిగిన గొడవ కా రణంగా పావని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది.పావని పరిస్థితి విషమించడంతో హైదరా బాద్ నుంచి పారిపోయి విశాఖ వచ్చాడు శ్యామ్ కుమార్.విశాఖలోని ఒక లాడ్జి అద్దెకు తీసుకు న్నాడు.అక్కడి నుండి తన స్నేహితులతో సమా చారం సేకరించాడు.పావని మరణ వార్త తెలుసు కున్న శ్యామ్ కుమార్ తలుపులు తీయకపోవ డంతో లాడ్జి సిబ్బందికి అనుమానం కలిగి స్పేర్ కీ తో తలుపులు తీసి చూడగా విగతజీవిగా పడివున్నాడు.దీంతో ఖంగుతిన్న లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు రెండు సూసైడ్ నోట్లు,ఎలుకల మందు ప్యాకట్లు లభ్యం కావడం తో...మద్యంలో విషం కలుపు కుని ఆత్మహత్య కు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు.మృతుడు స్వస్థలం వి శాఖలోని పాత పోస్టాఫీస్ ప్రాంతం.మృతుడి కు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీ సులు.పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తర లించారు.
Comments
Post a Comment