సులభంగా డబ్బు సంపాదనకు బాలికలను దొం గలించి ఎత్తుకెళ్తున్న నిందితురాలిని పట్టుకున్న తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు...

సులభంగా డబ్బు సంపాదనకు బాలికలను దొంగలించి 
ఎత్తుకెళ్తున్న నిందితురాలిని పట్టుకున్న 
తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు
తల్లిదండ్రులకు చిన్నారులను అప్పజెప్పిన పోలీసులు

VS9TV న్యూస్,తిరుమల : 
సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు చిన్నారులను దొంగిలించిన నిందితురాలిని తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.బాలి కలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.వి వరాలు ఇలా ఉన్నాయి...పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుకు చెందిన లక్ష్మి,రాంబాబు దం పతులు తమ కుమార్తెలు నవదుర్గ(5),అశ్విని(3)లతో తిరుమల వచ్చారు.ఈ నెల 16న ఉ దయం స్థానిక నాదనీరాజనం ప్రాంతంలో బాలికలు ఆడుకుం టుండగా...అన్నమయ్య జి ల్లా,కలకడ మండ లానికి చెందిన గుండ్లూరు శివమ్మ వారిని దొంగిలించి,వెతుకెళ్లి తన వెంట తీసుకుపోయింది.
ఈ నేపథ్యంలో బాలికల తల్లి తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పిర్యాదు మేరకు ఎస్‌ఐలు చలపతి,రమేష్‌బాబుల ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి ప్రత్య క్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించారు.ప్రత్యేక పోలీసు బృందాలతో కలిసి ఈ నెల 17న కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో నిందితురాలిని అదుపులోకి తీసుకుని,ఇద్దరు చిన్నారుల ను రక్షించారు.బాలికలకు రాజమహేంద్రవరం బాలల సంరక్షణ గృహానికి అప్పగించి,నిం దితురాలిని హోంకు తరలించారు.సులభంగా నగదు సంపాదించాలనే ఉద్దేశంతో తిరు మలలో ఒంటరిగా ఉన్న చిన్నారులను ఎత్తుకెళ్తుంది.వారితో భిక్షాటన చేయించేందుకు ప్ర ణాళిక రచించినట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించింది.తిరుపతిలోని సీడబ్ల్యూసీ ద్వా రా బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు.

Comments