ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో జంప్...

ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో జంప్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
ఏటీఎంలలో డబ్బులు నింపాల్సిన కస్టోడియన్లు ఏకం గా రూ.1.20 కోట్లను స్వాహా చేసి పరారయ్యారు.సి కింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సీఎంఎస్ ఇన్ఫో సిస్ట మ్స్ లిమిటెడ్’ అనే సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిటింగ్‌లో ఈ భారీ మోసం వెలుగుచూసింది.వివ రాల్లోకి వెళితే...సీఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల ఏటీ ఎంలలో నగదు నింపే కాంట్రాక్టును నిర్వహిస్తోంది.ఇ టీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 31ఏ టీఎంలలో సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్ర మంలో ఎనిమిది ఏటీఎంలలో నగదు తక్కు వగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు.మొ త్తం రూ.1,20,98,500 తేడా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఎనిమిది ఏటీఎంల బాధ్యతలు చూస్తున్న ఇద్దరు కస్టోడియన్లపైనే సంస్థ యాజమాన్యం అ నుమానం వ్యక్తం చేస్తోంది.గత కొన్ని రోజులుగా వారు విధులకు హాజరుకాకపోవడం,వారి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉం డటంతో వారే ఈ సొమ్మును కాజేసి ఉంటారని భావి స్తున్నారు.నిందితులు ఒకేసారి కాకుండా,విడతల వారీగా నగదును పక్కదారి పట్టించి ఉంటారని అను మానం వ్యక్తం చేస్తున్నారు.సంస్థ బ్రాంచ్ మేనేజర్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమో దు చేశారు.నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments