పెళ్లి పేరుతో వల...రూ.1.5కోట్ల కట్నం డీల్... చివరికి కటకటాల్లోకి...

పెళ్లి పేరుతో వల...రూ.1.5కోట్ల కట్నం డీల్... చివరికి కటకటాల్లోకి
VS9TV న్యూస్,హైదరాబాద్ :
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమై,తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి ఓ యువతి కుటుం బాన్ని మోసం చేయబోయిన వ్యక్తి కటకటాల పాల య్యాడు.పెళ్లి పేరుతో రూ.1.5కోట్ల కట్నం డిమాండ్ చేసి,నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ కేటుగాడి బం డారం ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో జరిగిన వేధింపు ల తో బయటపడింది.ఈ ఘటన హైదరాబాద్‌లో వెలు గుచూసింది.వివరాలు ఇలా ఉన్నాయి...హైదరాబాద్‌ కు చెందిన పనస మధు (30) ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు.తాను ఫుడ్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియా (FCI)లో గ్రేడ్-3 టె క్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో పనిచేస్తున్నట్లు పేర్కొ న్నాడు.ఈ క్రమంలో నల్గొండకు చెందిన ఓ యువతి ప్రొఫైల్ చూసి ఆమెను సంప్రదించాడు.మాటలతో న మ్మించి,ఆమె కుటుంబాన్ని కలిసి పెళ్లి ప్రస్తావన తె చ్చాడు.తన ఉద్యోగాన్ని నిరూపించేందుకు నకిలీ ఐడీ కార్డు కూడా చూపించడంతో వారు నిజమని నమ్మా రు.యువతి కుటుంబం ఆర్థికంగా స్థితిమంతులని గ్రహించిన మధు,తొలుత రూ.2 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు.చివరకు ఇరు కుటుంబాల మధ్య చర్చల అ నంతరం కోటిన్నరకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూ డా జరిగింది.అయితే,ఇటీవల ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరు తో యువతిని హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న ఓ గదికి పిలిపించిన మధు,ఆమెను అనుమానిస్తూ తీవ్రంగా వేధించాడు.అతని ప్రవర్తనతో భయపడిన యువతి,ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తె లియజేసింది.దీంతో అనుమానం వచ్చిన వారు మ ధు ఉద్యోగం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.అతను FCI ఉద్యోగి కాదని తేలడం తో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు న మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మధును ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments