ఏసీబీకి చిక్కిన తహసీల్దార్,సర్వేయర్...

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్,సర్వేయర్
VS9TV న్యూస్,బనగానపల్లె :
నంద్యాల జిల్లా,బనగానపల్లె తహసిల్దార్ కా ర్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశా రు.లంచం తీసుకుంటున్న తహసిల్దార్,సర్వే యర్‌ను బహిరంగంగా పట్టుకున్నారు.వివరా లు ఇలా ఉన్నాయి...బనగాన పల్లె పట్టణంలో ని కోనాపురం నారాయణరెడ్డికి చెందిన 121 సర్వే నెంబర్ చుక్కల భూమిని పట్టా భూమి గా మార్చడానికి బనగాన పల్లె కరెంట్ ఆఫీస్ దగ్గర రూ.50 వేలు లంచం తీసుకుంటూ ముం దుగా మండల సర్వేయర్ హుస్సేన్ భాష పట్టు బడ్డారు.తర్వాత ఆయనతో నేరుగా బనగాన పల్లె తహసిల్దార్ రాజీవ్ రెడ్డికి ఫోన్ చేయించా రు.ఈ క్రమంలో రూ.50,0 00 డబ్బులు తీసు కుని కార్యాలయంకు రావాలని ఎంఆర్ఓ సూ చించారు.దీంతో సర్వేయర్‌ను తీసుకుని కా ర్యాలయానికి వెళ్ళిన ఏసీబీ డిఎస్పి సోమన్న ఇద్దరినీ బహిరంగంగా పట్టుకున్నారు.

Comments