మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు
ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం ఇచ్చిన వారికి, తల్లిదండ్రులపై చర్య లుంటాయని కర్నూల్ ట్రాఫిక్‌ సీఐ మన్సురుద్దీన్ తెలిపారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు,కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూల్ నగరంలో లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై చర్యలు తీసుకునేందుకు రాజ్ విహార్ సెంట ర్ లో స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ లైసె న్స్‌ లేకుండా వాహనం నడుపుతున్న మైనర్ల ను పట్టుకున్నట్టు తెలిపారు.15మంది మైనర్ వాహనాలను కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చి హెచ్చరించిన ట్టు చెప్పారు.మైనర్లు పట్టుబడితే తక్షణమే కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రుల ను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తామని,మార్పు రాకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.అనంతరం లైసెన్స్‌ లేకుండా బండి నడపబోమని మైనర్లచేత ప్రతిజ్ఞ చే యించారు.వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ట్రాఫిక్ నిబంధనల వీడియో షోలు మరియు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు మైనర్లకు చూపిం చారు.మొదటిసారిగా కౌన్సిలింగ్ చేసి,రెండవసారి పట్టు బడితే జరిమానాలు విధించ నున్నామని ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...