వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం2026-2027 సంవత్సరాలకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియకె.ఎస్.విశ్వనాథన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు
రాష్ట్ర,జిల్లా స్థాయిలలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండు సంవత్సరాల (2026-202 7) కాలపరిమితికి సమాచార,పౌర సంబంధాల శాఖ జారీ చేసే నూతన అక్రిడిటేషన్ ల కు దరఖా స్తులను స్వీకరిస్తున్నట్లు సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం ఒక ప్రక టనలో తెలిపారు 2026-27 రెండు సంవ త్సరాలకు జారీ చేసే అక్రిడిటేషన్స్ కు నిబం ధనల మేరకు అర్హత కలిగిన పాత్రికేయుల దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తార న్నారు.గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది నవంబర్,30నాటికి ముగుస్తున్నందున నూతన అక్రిడిటేషన్స్ జారీ ప్రక్రియ చేపట్ట డం జరిగిందన్నారు. దర ఖాస్తుల నమోదుకు ముందుగా మీడియా సంస్థల వివరాలు పోర్టల్ లో పొందుపరచవ లసి ఉన్నందున సంబంధిత పత్రాల డాక్యు మెంట్లను పెన్ డ్రైవ్ లో పొందుపరిచి,జిరాక్స్ కాపీలను సమాచార,పౌర సంబంధాల శాఖ,పండిట్ నెహ్రూ బస్టాండ్,ఎన్టీఆర్ అడ్మినిస్ట్రే టివ్ బ్లాక్,రెండవ అంతస్థులోని విజయవాడ కార్యాలయంలో అందజేయాలన్నారు.అనం తరం పాత్రికేయులు నవంబర్,14వ తేదీ నుండి ఆన్ లైన్ వెబ్ సైట్ https://media relations.ap.gov.inలో సూచించిన విధంగా సంబంధిత పూర్తి వివరాలను న మోదు చేయాల్సి ఉంటుందని సంచాలకులు కే.ఎస్.విశ్వనాథన్ ఆ ప్రకటనలో తెలియజే శారు.
Comments
Post a Comment