ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న
రోడ్డు స్థలాన్ని కాపాడాలి
కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి
ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అందచేత

VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు అర్బన్,పందిపాడు,ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలాన్ని కాపా డాలని కాలనీ వాసులు మంగళవారం కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు,నాల్గవ పట్ట ణ సిఐ విక్రమ్ సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా కాలనీ వాసు లు రాము,నాగేంద్ర,అన్వర్ భాష,శేఖర్ రెడ్డి,మౌలాలి,శ్రీదేవి,ప్రసాదు,నాగరాజులు మాట్లా డుతూ 2010వ సంవత్సరంలో ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీలో సుమారు 2500 ప్లాట్ల ను పేదలకు కేటాయించింది.కాలనీ లేఅవుట్ ప్రకారం ప్రజల సౌకర్యార్థం నాలుగు పార్కు లు,ఇతర ఖాళీ స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు.కాలనీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో,మౌలిక సదుపాయాలు పెరుగుతుండటంతో భూముల విలువ పెరిగింది.దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది స్వార్థపరులు,అక్రమార్కులు కాలనీలోని పార్కు స్థలా లు,రోడ్డుస్థలాలు,ఖాళీ స్థలాలపై కబ్జాకు కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు.నిబంధనలకు విరు ద్ధంగా పార్కు స్థలాల్లో ప్లాట్లు వేసి అమాయకులకు విక్రయిస్తున్నారు.ఇది పూర్తిగా చట్టవి రుద్ధం.ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన చెందారు.ఇలాంటి ఘటనల పట్ల స్థానిక నివాసితులు ప్రశ్నిస్తే,సదరు వ్యక్తులు ఎదురు తిరుగుతూ దౌర్జన్యానికి దిగుతున్నారు.ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి" అంటూ బెదిరింపులకు పాల్పడుతు న్నారన్నారు.కావున కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐలు చొరవ చూపించి,కబ్జా లను అరికట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...