అక్రిడిటేషన్ లను త్వరితగతిన పునరుద్దఃరించాలి


అక్రిడిటేషన్ లను త్వరతగతిన పునరుద్ధరించాలి

కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కమిటీ

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

జర్నలిస్టుల అక్రిడిటేషన్ లను త్వరతగతిన పునరుద్ధరించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యూజేఎఫ్) నాయకులు అన్నారు.సోమవారం జిల్లా,కలెక్టర్ కార్యాలయం,సునయన అడిటోరియం,ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పి.నాగేంద్రుడు,జి.మునిస్వామి మాట్లాడుతూ...జర్నలిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన అక్రిడిటేషన్ కాలపరిమితి ఈనెల 28వ తేదీతో గడువు ముగియనుందన్నారు.కావున త్వరితగతిన నూతన అక్రిడిటేషన్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.లేనిపక్షంలో జర్నలిస్టులు తమ బస్సు చార్జీల రాయితీలను నష్టపోవాల్సి వస్తుంది.వెంటనే అక్రిడిటేషన్ లో పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించి మార్చి,1వతేదీ లోపలనే జర్నలిస్టులు అక్రిడిటేషన్లను పునరుద్ధరించి ఆర్టీసీ చార్జీలో రాయితీకి ఆటంకం రాకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిఫారస్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ జిల్లా నాయకులు నీలం సత్యనారాయణ, చంద్రమోహన్,విజయ్ కుమార్, మల్లికార్జున,నగర కోశాధికారి రాజశేఖర్, నాయకులు అసిఫ్,వరప్రసాద్, జయరాజు,రవిగౌడ్,కరణ్,ప్రసాద్,శేఖర్, లోకేష్,రవి,ఉరుకుందు,సంజీవయ్య, జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....