అక్రిడిటేషన్ లను త్వరితగతిన పునరుద్దఃరించాలి
కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కమిటీ
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
జర్నలిస్టుల అక్రిడిటేషన్ లను త్వరతగతిన పునరుద్ధరించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యూజేఎఫ్) నాయకులు అన్నారు.సోమవారం జిల్లా,కలెక్టర్ కార్యాలయం,సునయన అడిటోరియం,ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పి.నాగేంద్రుడు,జి.మునిస్వామి మాట్లాడుతూ...జర్నలిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన అక్రిడిటేషన్ కాలపరిమితి ఈనెల 28వ తేదీతో గడువు ముగియనుందన్నారు.కావున త్వరితగతిన నూతన అక్రిడిటేషన్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.లేనిపక్షంలో జర్నలిస్టులు తమ బస్సు చార్జీల రాయితీలను నష్టపోవాల్సి వస్తుంది.వెంటనే అక్రిడిటేషన్ లో పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించి మార్చి,1వతేదీ లోపలనే జర్నలిస్టులు అక్రిడిటేషన్లను పునరుద్ధరించి ఆర్టీసీ చార్జీలో రాయితీకి ఆటంకం రాకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిఫారస్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ జిల్లా నాయకులు నీలం సత్యనారాయణ, చంద్రమోహన్,విజయ్ కుమార్, మల్లికార్జున,నగర కోశాధికారి రాజశేఖర్, నాయకులు అసిఫ్,వరప్రసాద్, జయరాజు,రవిగౌడ్,కరణ్,ప్రసాద్,శేఖర్, లోకేష్,రవి,ఉరుకుందు,సంజీవయ్య, జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
Comments
Post a Comment