అసెంబ్లీ పాసుల విషయంలో వివక్ష దారుణం
అసెంబ్లీ పాసుల విషయంలో వివక్ష దారుణం
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కవరేజ్ నిమిత్తం మీడియా సంస్థలకు ఇచ్చే పాసులు విషయంలో వివక్ష దారుణం అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) పేర్కొంది.చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన విధిని జర్నలిస్టులు నిర్వహించాల్సి ఉందన్నారు.ఈ విషయంలో అసెంబ్లీ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) రాష్ట్ర నాయకులు నీలం సత్యనారాయణ,చిన్న రామాంజనేయులు,విద్యాసాగర్,చంద్రమోహన్,విజయ్ కుమార్,రాజశేఖర్, జి.విజయ్ కుమార్,యూసుఫ్ ఖాన్,మల్లికార్జున,అసిఫ్,పరమేష్, నాగేంద్రుడు,గిలిగిత్త విజయ్ కుమార్,వరప్రసాద్,గంగాధర్, వై.వెంకటేశ్వర్ రెడ్డిలు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ పాసుల విషయంలో కొన్ని సంస్థలకు అవకాశం కల్పించి,మరికొన్ని సంస్థలను నిరాకరించినట్లు తెలిసిందని,ఈ విషయంపై సభాపతి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి,మీడియా సంస్థలన్నింటికీ తగిన రీతిలో పాస్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఒకరిని అక్కున చేర్చుకుని మరోకరిని పక్కకు నెట్టడం సమంజసం కాదన్నారు. మీడియా సంస్థలకు పాసుల మంజూరు విషయంలో అధికారుల తీరు మీడియాను అవమానించేదిగా ఉందని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) పేర్కొంది.
Comments
Post a Comment