శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న గౌరు దంపతులు
శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న గౌరు దంపతులు
VS9TV న్యూస్,కల్లూరు :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం కర్నూలు జగన్నాథ గట్టు,శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి,ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు,నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు వెంకట రెడ్డి,యువ నాయకుడు గౌరు జనార్ధన్ రెడ్డిలు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా వారు ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment