కోటప్పకొండ తిరుణాలకు రికార్డ్ స్థాయిలో ఆదాయం.
కోటప్పకొండ తిరుణాలకు రికార్డ్ స్థాయిలో ఆదాయం.
గత ఏడాది కంటే రూ14,19,945 అధిక ఆదాయం.
ఈఓ డి.చంద్రశేఖరరావు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
కోటప్పకొండ అనగానే...అందరికీ గుర్తొచ్చేది మహా శివరాత్రి తిరునాళ్లు, ప్రభలు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో...అశేష భక్త జన సందోహం మధ్య జరిగే కోటయ్య ఉత్సవాలకు ఏపీలోని భక్తులతో పాటు... పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా విచ్చేస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ మొత్తం శివనామస్మరణతో మారుమ్రోగిపోయింది.లక్షలాది మంది భక్తుల రాకతో త్రికూట పర్వతం సందడిగా మారింది.తమ ఇష్టదైవానికి శివుడుకి మొక్కులు చెల్లించుకుని భక్తులు తన్మయత్వం పొందారు.ఫిబ్రవరి, 26న మహా శివరాత్రి సందర్భంగా.. కోటప్పకొండ తిరునాళ్లకు విచ్చేసిన భక్తులు ఆ త్రికోటేశ్వరుడిని దర్శించుకుని...వివిధ రూపాల్లో స్వామివారికి రూ.1.77.68.172(కోటి, డెబ్భై ఏడు లక్షలు,అరబై ఎనిమిది వేలు, నూట డెబ్భై రెండు) ఆదాయాన్ని సమర్పించారు.వివిధ రకాల పూజ టిక్కెట్ల ద్వారా రూ.65,01,070 ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.38,17,395లు అన్నదానం ఇతర స్కీముల ద్వారా 1,01,789 హుండీల కానుకల ద్వారా రూ.73,47,918లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి డి.చంద్రశేఖర్ రావు తెలిపారు.
Comments
Post a Comment