పత్తిపంట కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించాలి.

పత్తిపంట కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించాలి.

పత్తిపంటకు క్వింటాలుకు రూ.10వేలు పదివేలు ఇవ్వాలి 

ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

పత్తిపంట కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని క్వింటాలుకు పదివేల రూపాయలు తక్కువ కాకుండా రైతులకు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ,ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ.కృష్ణ గూడూరు మండలం అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.సోమవారం ప్రజా దర్బారులో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ను కలిసి రైతు సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జి. రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకుపైగా పత్తిపంట సాగు అయిందని,దిగుబడి కూడా ఈ సంవత్సరం కొంత మెరుగైందని ఎనిమిది క్వింటాళ్ల నుండి 12,13,14 క్వింటాళ్లు ఎకరాకు వచ్చాయని తెలిపారు.దిగుబడి వచ్చినప్పటికీ ధర లేకపోవడం వలన రైతులు పెట్టిన పెట్టుబడిదాకా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఖరీఫ్లో పండిన పంట నవంబర్ మాసం వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.
ఆదోని,మంత్రాలయం,ఎమ్మిగనూరు, కోడుమూరు మండలాలలో సుమారుగా 12కేంద్రాలలో ఏర్పాటుచేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రైతుల నుండి పత్తి కొనుగోలు చేశారు. కానీ ఉన్నట్లుండి నవంబర్ మాసం చివర్లో పత్తి కొనుగోలు కేంద్రాలు మూసివేశారు. ఫలితంగా రైతులు లబోదిబోమంటున్నారు.రైతులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు కొనుగోలు కేంద్రాలు మూసివేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికీ కర్నూలు జిల్లాలో 50వేల క్వింటాళ్ల వరకు రైతుల దగ్గర నిలువ ఉన్నాయని,ప్రారంభంలో తీసిన పత్తి ఇప్పటికీ రైతుల దగ్గర ఉన్నదని వాటిని కొనుగోలు చేయకపోతే రైతులు అమాంతం నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు.కావున కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి.కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించి పూర్తి పత్తిని కొనుగోలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ రంజిత్ భాష సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే మార్కెటింగ్ వారు సిసిఐ వారితో కోఆర్డినేషన్ చేసుకొని తిరిగి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ భాష అదేచించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే. మధు,రైతులు సీతారాముడు,శివన్న, ఆంజనేయులు,షేక్షావలి,ఇంకా అనేక మంది రైతులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....