ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి.
డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్
VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ, అత్యవసర విభాగాలలో మందుల కొరతపై మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు. ఆరా తీశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలోని పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు.క్యాజువాలిటి,ఎమర్జెన్సీ విభాగాలలో మందుల కొరత లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ కొరకు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామన్నారు పేషంట్ కి అవసరమైన మందులు ఇవ్వడానికి ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు.కొన్ని మందులు లేని వాటిపై లోకల్ పర్చేజ్ లో మందులన్నీ కొనుగోలు చేశామన్నారు. పీఎంబిజెకె ద్వారా,లోకల్ ఏజెన్సీ నుంచి అన్ని అత్యవసర మందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.మందుల కొరత ఎలాంటి సమస్య లేదు.అన్ని రకాలుగా మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు రోగులు క్షతగాత్రులు అత్యవసర విభాగానికి వస్తే వారిని ఎక్స్రేకు,స్కానింగ్ కు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.న్యూ డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్యపరీక్షల కొరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో పెట్టామని అన్నారు. ఆసుపత్రిలోని అవసరమైన మందులు అందుబాటులు ఉన్నాయి.ఎవరైనా బయటికి రాస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రోగులు ఏమన్నా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే దానికి వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
Comments
Post a Comment