శునకాల బెడద నియంత్రణకు చర్యలు
శునకాల బెడద నియంత్రణకు చర్యలు
శస్త్ర చికిత్స కేంద్రాన్ని పరిశీలన
చికిత్సలకు ఏడబ్లూబిఐ అనుమతులు మంజూరు
సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు ప్రారంభం
ఎస్.రవీంద్రబాబు,కమిషనర్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలో శునకాల బెడద నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. గురువారం ఆయన గార్గేయపురం డంప్ యార్డులోని శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో కుక్కల బెడద నియంత్రణకు సంబంధించి,వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను తిరిగి పునః ప్రారంభించినట్లు వెల్లడించారు.ఏజెన్సీకి ప్రాజెక్ట్ రికగ్నేషన్ సర్టిఫికెట్ లేనందున గత ఏడాది ఆగస్టు,8న శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయని,తిరిగి ప్రారంభించేందుకు అనుమతుల కోసం ఇటీవల భారత జంతు సంక్షేమ మండలికి దరఖాస్తు చేసుకున్నామన్నారు.మండలి సభ్యురాలు గత నెల 8న శస్త్ర చికిత్స కేంద్రాన్ని పరిశీలించారని,ఇటీవల అనుమతులు మంజూరు చేశారన్నారు. దీంతో శునకాలకు శస్త్ర చికిత్సలను పునః ప్రారంభించడం జరిగిందని, ఒక్కొక్క శునక శస్త్ర చికిత్సక రూ.1500 ఏజెన్సీకి నగరపాలక వెచ్చిస్తుందన్నారు. నగరంలో దాదాపు 15వేల శునకాలు ఉండొచ్చని,గతంలో 10054 శునకాలకు ఆపరేషన్ చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు.
Comments
Post a Comment