టికెట్పై రూ.40 అదనంగా వసూళ్లు... థియేటర్నే సీజ్ చేయించిన మహిళ...
టికెట్పై రూ.40 అదనంగా వసూళ్లు
థియేటర్నే సీజ్ చేయించిన మహిళ
VS9TV న్యూస్,అంబేద్కర్,కోనసీమ :
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో "కోర్టు" సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ అనే థియేటర్ యాజమాన్యంపై అమలాపురం ఆర్డీఓ కె.మాధవి చర్యలు తీసుకున్నారు.ఈ థియేటర్లో టికెట్లు రూ.40 ఎక్కువ చేసి అమ్ముతున్నారని అధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు.నిజమేనని తేలడంతో ఆర్డీఓ చర్యలు చేపట్టారు.థియేటర్ సీజ్ చేశారు.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో ఓ మహిళ వచ్చి టిక్కెట్టు కౌంటర్ వద్దకు వెళ్లి కోర్టు సినిమాకు రెండు ఫస్ట్క్లాస్ టిక్కెట్లు కావాలని అడిగారు. రూ.300 ఇచ్చుకుని రెండు టిక్కెట్లు ఇచ్చాడు కౌంటర్లో టిక్కెట్టు అమ్ముతున్నారు.టిక్కెట్టు తీసుకున్న ఆమె నేరుగా థియేటర్లోకి వెళ్లకుండా అదే కౌంటర్లోకి రావడంతో అంతా షాక్ అయ్యారు.ఆ మహిళ వెంట సబార్డినేట్,స్థానిక తహసీల్దార్ ఉండడంతో ఆమె నార్మల్ వ్యక్తి కాదని తెలిసింది.ఆమె సినిమా చూడడానికి రాలేదని తనిఖీల కోసం వచ్చిన అమలాపురం ఆర్డీఓ కె.మాధవి అని తేలింది."కోర్టు" సినిమాకు రూ.110 టిక్కెట్టు అమ్మాల్సి ఉంది.కానీ సాధారణ మహిళగా వచ్చిన ఆర్డీఓకే రూ.150 అమ్మడంతో థియేటర్ యాజమాన్యం అడ్డంగా బుక్ అయింది.లైవ్ సాక్ష్యాలు ఉండటంతో చర్యలకు ఉపక్రమించారు ఆర్డీఓ మాధవి.కేవలం "కోర్టు" సినిమాకే కాదు ఈ థియేటర్లో ఆడుతున్న ప్రతి సినిమాకు ధరలు పెంచి అమ్ముతున్నారని రికార్డుల ఆధారంగా గుర్తించారు. థియేటర్ అనుమతుల రెన్యువల్ గడువు ముగిసినప్పటికీ సినిమాలు ప్రదర్శిస్తుండడంపై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.రెన్యువల్ చేయించుకోకుండా సినిమాలు ప్రదర్శించడం, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు.కేసు నమోదు చేశారు.థియేటర్ సీజ్ చేశారు.
Comments
Post a Comment