టికెట్‌పై రూ.40 అదనంగా వసూళ్లు... థియేటర్‌నే సీజ్ చేయించిన మహిళ...

టికెట్‌పై రూ.40 అదనంగా వసూళ్లు

థియేటర్‌నే సీజ్ చేయించిన మహిళ

VS9TV న్యూస్,అంబేద్కర్,కోనసీమ :

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో "కోర్టు" సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ అనే థియేటర్‌ యాజమాన్యంపై అమలాపురం ఆర్డీఓ కె.మాధవి చర్యలు తీసుకున్నారు.ఈ థియేటర్‌లో టికెట్లు రూ.40 ఎక్కువ చేసి అమ్ముతున్నారని అధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు.నిజమేనని తేలడంతో ఆర్డీఓ చర్యలు చేపట్టారు.థియేటర్‌ సీజ్‌ చేశారు.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అమలాపురంలో ఓ మహిళ వచ్చి టిక్కెట్టు కౌంటర్‌ వద్దకు వెళ్లి కోర్టు సినిమాకు రెండు ఫస్ట్‌క్లాస్‌ టిక్కెట్లు కావాలని అడిగారు. రూ.300 ఇచ్చుకుని రెండు టిక్కెట్లు ఇచ్చాడు కౌంటర్‌లో టిక్కెట్టు అమ్ముతున్నారు.టిక్కెట్టు తీసుకున్న ఆమె నేరుగా థియేటర్‌లోకి వెళ్లకుండా అదే కౌంటర్‌లోకి రావడంతో అంతా షాక్ అయ్యారు.ఆ మహిళ వెంట సబార్డినేట్‌,స్థానిక తహసీల్దార్‌ ఉండడంతో ఆమె నార్మల్‌ వ్యక్తి కాదని తెలిసింది.ఆమె సినిమా చూడడానికి రాలేదని తనిఖీల కోసం వచ్చిన అమలాపురం ఆర్డీఓ కె.మాధవి అని తేలింది."కోర్టు" సినిమాకు రూ.110 టిక్కెట్టు అమ్మాల్సి ఉంది.కానీ సాధారణ మహిళగా వచ్చిన ఆర్డీఓకే రూ.150 అమ్మడంతో థియేటర్‌ యాజమాన్యం అడ్డంగా బుక్ అయింది.లైవ్‌ సాక్ష్యాలు ఉండటంతో చర్యలకు ఉపక్రమించారు ఆర్డీఓ మాధవి.కేవలం "కోర్టు" సినిమాకే కాదు ఈ థియేటర్‌లో ఆడుతున్న ప్రతి సినిమాకు ధరలు పెంచి అమ్ముతున్నారని రికార్డుల ఆధారంగా గుర్తించారు. థియేటర్‌ అనుమతుల రెన్యువల్‌ గడువు ముగిసినప్పటికీ సినిమాలు ప్రదర్శిస్తుండడంపై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.రెన్యువల్‌ చేయించుకోకుండా సినిమాలు ప్రదర్శించడం, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు.కేసు నమోదు చేశారు.థియేటర్‌ సీజ్‌ చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...