ప్రతాప్ రెడ్డి మృతదేహానికి నివాళులు...మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ...
ప్రతాప్ రెడ్డి మృతదేహానికి నివాళులు
మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ
VS9TV న్యూస్,కోడుమూరు :
గూడూరు మండలం,చనుగొండ్ల గ్రామం, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి మృతి చెందిన సమాచారంను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న కోడుమూరు మాజీ శాసనసభ్యులు మణిగాంధీ గురువారం చనుగుండ్ల గ్రామానికి చేరుకొని ప్రతాప్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో నాయకులను కలుపుకుపోయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.నేడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామని ఆయన ఆవేదన చెందారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అస్లాం అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment