విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి... గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే...
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.మంగళవారం కర్నూలు నగరంలోని డివిఆర్ మాన్సస్ లో మలబార్ గోల్డ్ సంస్థ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ కార్యక్రమం నిర్వహించారు.స్టోర్ హెడ్ ఫయాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ మలబార్ సంస్థ నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయం అన్నారు.
సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న 209మంది విద్యార్ధినులకు రూ.18,64,000 స్కాలర్ షిప్ మొత్తంను చెక్కు ద్వారా అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.వి.ఇ.ఓ.వై.పరమేశ్వర రెడ్డి,వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్,మలబార్ గోల్డ్ సంస్థ వారి సిబ్బంది ఫయాజ్,నురుల్లా, విద్యార్ధినిలు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment