శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులు,అనాధలను చేర్చుకుంటాం...వాసంతి,ట్రస్ట్ చైర్మన్...
శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులు,అనాధలను చేర్చుకుంటాం
వాసంతి,ట్రస్ట్ చైర్మన్
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలం,పందిపాడు గ్రామ సమీపం,బిఆర్ రెడ్డి కాలనీలోని
శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ లో అనాధ పిల్లలను వృద్ధులను చేర్చుకుంటామని ట్రస్ట్ చైర్మన్ వాసంతి అన్నారు.బుధవారం ట్రస్ట్ లోని వృద్ధులకు బ్రాంచ్ మేనేజర్ అనిల్ చేతుల మీదగా పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా చైర్మన్ వాసంతి మాట్లాడుతూ నేటి నుంచి ట్రస్ట్ ఆధ్వర్యంలో తల్లి,తండ్రులు లేని పిల్లలను ట్రస్ట్ లో చేర్చుకుని అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.కుల,మత వర్ణ తేడా లేకుండా పిల్లలకు సంరక్షణ కల్పిస్తామని, వారికి మంచి చదువు,భవిష్యత్తు కల్పించడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ వాసంతి తెలిపారు.అనంతరం ట్రస్ట్ చైర్మన్ వాసంతి చేతుల మీదుగా హైదరాబాద్ బ్రాంచ్ చర్లపల్లి బ్రాంచ్ మేనేజర్ అనిల్ ని ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రెటరీ పవన్ కుమార్,ట్రస్ట్ కోశాధికారి మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment