శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం...దేవనకొండ పోలీసుల ఫ్లాగ్ మార్చ్...
VS9TV న్యూస్,పత్తికొండ :
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో, దేవనకొండ సిఐ వంశీనాథ్ ఆధ్వర్యంలో దేవనకొండ పోలీసులు పి.కోటకొండ గ్రామంలో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా దేవనకొండ మండలం, పి.కోటకొండ గ్రామంలో బుధవారం మారెమ్మ దేవర జరుగుతున్న సంధర్బంగా పోలీసుల ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు దేవనకొండ సిఐ వంశీనాథ్ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు,ప్రజల భద్రతే ముఖ్యంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు,ప్రజలకు నిత్యం అందుబాటులో పోలీసులు ఉంటారని, భరోసా కల్పించడానికి,ఎవరైనా శాంతి భధ్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో దేవనకొండ సిఐతో పాటు 80మంది పోలీసులు పాల్గొన్నారు
Comments
Post a Comment