అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు... రవిచంద్ర,జంగారెడ్డిగూడెం డీఎస్పీ...
అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు
రవిచంద్ర,జంగారెడ్డిగూడెం డీఎస్పీ
VS9TV న్యూస్,ఏలూరు క్రైం :
అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు.ఈ మేరకు సిఎంఒ స్టిక్కర్స్ వేసుకొని హల్ చల్ చేసిన ఉరకరణం జగన్నాథరావును తడికలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సిఎంఒ స్టిక్కర్స్ పై డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో సిఎంఒ
స్టిక్కర్ నకిలీది కావడంతో జగన్నాథరావు ను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్బంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఎవరైనా అనధికారికంగా సైరన్,ప్రభుత్వానికి చెందిన ఇతర గుర్తింపు స్టిక్కర్లని వేసుకొని తిరిగితే ఎంతటి వారైనా సరే సహించేది లేదన్నారు.ఇప్పటికే పలు కేసుల్లో ఉరకరణం జగన్ నిందితుడుగా ఉన్నట్లు చెప్పారు.కామవరపుకోటలో ఒక స్కూల్ అనుమతుల కోసం రూ.5లక్షలు డిమాండ్ చేశాడన్నారు.నగదు ఇవ్వకపోతే స్కూల్ పై ఫిర్యాదు చేసి ముసివేస్తానని బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు జగన్ ను అరెస్ట్ చేసి చింతలపూడి కోర్టులో హాజరు పరచిన అనంతరం రిమాండ్ కి తరలించారు.
Comments
Post a Comment