టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలి...లబ్ధిదారులతో సమావేశాలు,సదస్సులు ఏర్పాటు చేస్తాం...ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు నిర్వహిస్తాం...కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి...

టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలి

లబ్ధిదారులతో సమావేశాలు,సదస్సులు ఏర్పాటు చేస్తాం

ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు నిర్వహిస్తాం

కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : 

పేదల కొరకు ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.బుధవారం ఆయన కర్నూలు నగర శివారులో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయాన్ని పరిశీలించి,అక్కడ నివాసముంటున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు 2017లో - పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో టిడ్కో పేరుతో నాణ్యతతో కూడిన గృహాలు నిర్మించడం జరిగిందన్నారు.కర్నూలు నగరంలో సుమారు 10,400 గృహాలు రూ.575కోట్లతో నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.90శాతం పూర్తి అయిన గృహాలను అతరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పాటు అద్దె చెల్లించలేక, లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కర్నూలు నగర శివారులో ఉన్న టిడ్కో గృహాలకు నీటి వసతి,డ్రైనేజి,రవాణా సౌకర్యం లేదన్నారు.అయితే ఇప్పటికే ఇంటి అద్దె చెల్లించలేని సుమారు 130మంది లబ్దిదారులు వారికి కేటాయించిన గృహాల్లో నివాసం ఉంటున్నారన్నారు.
రాత్రి వేళల్లో విషసర్పాలు వస్తున్నాయని, నీళ్ళు రోజుమార్చి రోజు వస్తున్నాయని, ప్రభుత్వం ఇచ్చే రేషన్ కోసం నగరంలోకి పోయి తెచ్చుకోవలసి వస్తుందని,రవాణా సౌకర్యం లేదని ఇక్కడ నివాసం ఉంటున్న లబ్దిదారులు చెపుతున్నారన్నారు.ప్రభుత్వం ఇంటిని ర్మాణాల కోసం ఇప్పటి కే రూ.500 కోట్లు ఖర్చు చేసిందని,మరో రూ.100 కోట్లు ఖర్చుచేస్తే 10,400 గృహాలకు కావలసిన మౌళిక వసతులు కల్పించవచ్చన్నారు. ప్రభుత్వం వెంటనే టిడ్కో గృహాల్లో మౌళిక వసతులు కల్పించి లబ్దిదారులకు కేటాయించాలన్నారు.లేని పక్షంలో లబ్దిదారులను ఒక వేధిక మీదకు తీసుకు వచ్చి టిడ్కొ గృహాలకు మౌళిక వసతులు కల్పించాలని,త్వరలోనే టిడ్కో గృహాల లబ్దిదారులతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సదస్సు నిర్వహిస్తామన్నారు.టిడ్కో లబ్దిదారులకు పంపిణీ చేసేంత వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.అనంతరం టిడ్కో అధికారి రవికుమార్ గుప్తతో మాట్లాడి,టిడ్కో గృహాల మౌళిక వసతులు కల్పించి లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య,సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప,సీనియర్ నాయకులు కె.జగన్నాథం,నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి,సహాయ కార్యదర్శులు సి.మహేష్, డి,శ్రీనివాసరావు,నగర కార్యవర్గ సభ్యులు బీసన్న,నల్లన్న,అన్వర్,సోమన్న, నాగరాజు,కుమార్,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ కుమార్, నగర అధ్యక్ష, కార్యదర్శులు అభి,అశోక్,ఏఐటీయూసీ నాయకులు రామాంజనేయులు,పెద్ద ఎత్తున సీపీఐ నాయకులు,వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...