ఎస్.వి.దంపతులకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ సలీం భాయ్ ఘన సన్మానం...
ఎస్.వి.దంపతులకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ సలీం భాయ్ ఘన సన్మానం
మన న్యూస్,కర్నూలు క్రైం :
మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి,ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు ఎస్. వి.విజయ మనోహరిలను వైఎస్ఆర్సిపి స్టేట్ మైనారిటీ సెక్రటరీ నియమించబడ్డ సలీం భాయ్ పూలమాలవేసి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎస్.వి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పజెప్పిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.సలీం భాయ్ మాట్లాడుతూ కర్నూలు నగరం వైఎస్ఆర్సిపి కంచుకోట అని ముస్లిం సామాజిక వర్గంలో ఎస్.వి.మోహన్ రెడ్డికి తిరుగులేని ఆదిక్యత ఉందని,ఆయన నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి తాము కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు,సలీం భాయ్ మిత్ర బృందం పాల్గొన్నారు
Comments
Post a Comment