ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...లోగో ఆవిష్కరణలో పిలుపునిచ్చిన లెనిన్ బాబు...

ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి

లోగో ఆవిష్కరణలో పిలుపునిచ్చిన లెనిన్ బాబు

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

తిరుపతి నగరంలో మే,15 నుంచి 18 వరకు జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్,17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు పిలుపునిచ్చారు.గురువారం నాడు కర్నూల్ నగరంలోని సిఆర్ భవన్ లో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో లోగోను ఎన్.లెనిన్ బాబు ఆవిష్కరించారు.అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో మే,15 నుంచి 18వరకు ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.మొదటిరోజు దేశ నలుమూలల నుండి వచ్చే వేలాదిమంది ఏఐవైఎఫ్ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించి అనంతరం అన్ని రాష్ట్రాల నుండి 1000మంది ప్రతినిధులు ప్రతినిధుల మహాసభలో పాల్గొంటారన్నారు.ఈ మహాసభలో నేడు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై,మతం పేరుతో జరుగుతున్న దాడులపై,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ దేశంలోని యువతను శాశ్వత నిరుద్యోగులుగా మారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన సుదీర్ఘంగా మూడు రోజులపాటు చర్చించి భవిష్యత్తులో భగత్ సింగ్ నేషనల్ గ్యారెంటీ ఎంప్లాయిమెంట్ యాక్ట్ తీసుకువచ్చి దేశంలోనే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడానికి 17వ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయని చెప్పారు.కావున ఈ మాహసభలకు అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు,శ్రీనివాసులు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి ఒక ప్రభుత్వ రంగ సంస్థను కూడా నెలకొల్ప లేక పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల్లో భాగమైన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలకే పరిమితమవుతా ఉన్నారు తప్ప స్టిల్ పరిశ్రమను ఏర్పాటు చేయలేకపోతున్నారని,డబల్ ఇంజన్ సర్కార్ అయిన కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగమైన నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకుండా మోసం చేస్తుందని కావున రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు చేస్తున్న మోసాలపై యువతలో చైతన్యం నింపేందుకు నిరుద్యోగ సమస్యపై సమర శిల పోరాటాలు కొనసాగించడానికి తిరుపతిలో జరిగే 17వ జాతి మహాసభల వేదిక కానున్నాయని వారు తెలిపారు.ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, బిసన్న,నగర నాయకులు అఖిల్,ఖాసిం, కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...