స్వచ్చత పనుల నిర్వహణపై అభిప్రాయం తెలుపండి...నగర ర్యాంకు మెరుగుదలకు సహకరించండి...ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్...
స్వచ్చత పనుల నిర్వహణపై అభిప్రాయం తెలుపండి
నగర ర్యాంకు మెరుగుదలకు సహకరించండి
ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలో రోజువారీ స్వచ్చత పనులపై నగర ప్రజలు తమ అభిప్రాయం తెలపాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బుధవారం ఒక ప్రకటనలో కోరారు.కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా నగరాలు,పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై మదింపు జరిపి ర్యాంకులు ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని,కర్నూలు నగరం ఆరంభంలో 221వ ర్యాంకులో ఉండగా, ప్రజలందరి భాగస్వామ్యంతో పురోగతి సాధించుకుంటూ, గత సంవత్సరానికి 32వ ర్యాంకుకు చేరుకున్నదని పేర్కొన్నారు.అయితే ఈ ఏడాది సింగిల్ డిజిట్ ర్యాంకు సాధించాలనే సంకల్పానికి నగరంలోని ప్రతి పౌరుడి సహకారం అవసరం అన్నారు.ఇందు కోసం స్వచ్చ సర్వేక్షన్ వెబ్సైట్ https://sbmurban.org/feedback ను ఓపెన్ చేసి స్వచ్ఛతకు సంబంధించి పది ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలరని కోరారు.ఈ సర్వే మార్చి,31నాటికి పూర్తి అవుతుందన్నారు.కర్నూలు నగర ర్యాంకును జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రతి పౌరుడు ఫిడ్బ్యాక్ నమోదు చేయాలని కమిషనర్ కోరారు.
Comments
Post a Comment