బకాయి సముదాయాల ఎదుట చెత్తా వాహనంతో నిరసన...ట్రేడ్ లైసెన్స్ మొండి బకాయిదారులపై ఒత్తిడి పెంచేందుకు చర్య...
బకాయి సముదాయాల ఎదుట చెత్తా వాహనంతో నిరసన
ట్రేడ్ లైసెన్స్ మొండి బకాయిదారులపై ఒత్తిడి పెంచేందుకు చర్య
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో,మొండి బకాయిలపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది.కొంతకాలంగా వినూత్న కార్యక్రమాలతో పన్ను బకాయిదారులపై ఒత్తిడి తీసుకొస్తున్న అధికారులు, తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.స్థానిక దేవనగర్లోని ఎంయస్9 లార్జ్ యాజమాన్యం,గత ఏడేళ్లుగా రూ.3,31,250 లు నగరపాలకకు ట్రేడ్ లైసెన్స్ రుసుములను చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గురువారం సంబంధిత లార్జ్ ఎదుట అధికారులు చెత్త వాహనం నిలిపి నిరసన వ్యక్తం చేశారు.నగరపాలక నుండి ప్రయోజనాలు పొందుతూ పన్నులు చెల్లించకుండా ఉండటం తగదని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, తనిఖీదారుడు అనిల్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment