చిన్నారి ఖర్చులకు ఐదువేలు సహాయం...డీఈఓ...
చిన్నారి ఖర్చులకు ఐదువేలు సహాయం...డీఈఓ...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
పబ్లిక్ పరీక్షల్లో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.శ్యామ్యూల్ పాల్ కోసిగిలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన పదవతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి చిన్నారిని పరీక్ష అనంతరం మౌంట్ కార్మెల్ పాఠశాలకు వెళ్లి పలకరించారు.కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేనందున,గత్యంతరం లేని స్థితిలో రూ.450 దినసరి కూలీగా తన తల్లిదండ్రులలో పాటు గుంటూరు మిరపకాయల పనికి వెళ్ళింది.స్థానికులు సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో చిన్నారి పరీక్షలు రాసేలా ప్రయాణం ఏర్పాట్లు చేశారు.ఆ బాలిక డీఈఓతో మాట్లాడుతూ గత పరీక్షల్లో తనకు మెరుగైన మార్కులు వచ్చాయని,పరీక్షలో కూడా 80మార్కులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.గైర్హాజరైన సబ్జెక్టులను సప్లిమెంటరీ పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటానని చెప్పడం, ఖచ్చితంగా పాసై ఇంటర్మీడియట్ బైపిసి చదువుతానని చెప్పడంను డీఈఓ ప్రత్యేకంగా అభినందించారు.చిన్నారి చెప్పిన విషయాలపట్ల స్పందించిన డీఈఓ ఐదువేలు వెంటనే ఇచ్చి ధైర్యం చెప్పారు. పదవతరగతి అనంతరం ఇంటర్మీడియట్ విద్యకు కస్తూరిబా కళాశాలలో చేర్పించి చదివిస్తామని, ఆదుకుంటామని డీఈఓ హామీ ఇచ్చారు. చిన్నారి పదవతరగతి పరీక్షలు వదిలేసి గుంటూరుకు వలస వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ వార్త పత్రికల్లో ప్రచురితమవ్వడంతో ప్రభుత్వం స్పందించింది.చిన్నారి పరీక్షలు రాసేలా గుంటూరు - కర్నూలు జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకొని స్వగ్రామానికి రప్పించారు. చిన్నారి పరీక్షలకు హాజరయ్యేలా జిల్లా విద్యాధికారి తక్షణ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 172 కేంద్రాలకుగానూ 253మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.ప్రైవేట్ లో 40 విద్యార్థులు గైర్హాజరయ్యారు.జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.
Comments
Post a Comment