హైడ్రో గంజాయి విక్రయిదారుల ముఠా అరెస్ట్...నిందితులు నుండి రూ.7.5 లక్షల విలువైన 500గ్రాముల హైడ్రో గంజాయి, మూడు చరవానీలు స్వాధీనం...సతీష్ కుమార్,గుంటూరు జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,మంగళగిరి క్రైం :
గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.సమావేశానికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చేప్పారు. నిందితులలో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా,మరో ఇద్దరూ విశాఖపట్నం చెందిన వారిగా దర్యాప్తులో తెలిసిందని,నిందితులు సంక్రాంతి నేపథ్యంలో పరిచయం పెరిగి బెంగళూరు వెళ్లి హైడ్రో గంజాయి సేవించి విక్రయించేందుకు తీసుకువస్తుండగా పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్ పోలీసులు కాజా టోల్ ప్లాజా వద్ద నిఘా వేసిన సీఐ శ్రీనివాసరావు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు గంజాయి విక్రయిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు చెడు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించవచ్చునని బెంగళూరులో ఉంటున్న ఒక వ్యక్తితో కలిసి అతని వద్ద హైడ్రో గంజాయి ఉన్న దాన్ని తెలుసుకొని దానికి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో అధిక ధరకు విక్రయించవచ్చునని అత్యాశతో నిందితులు 500గ్రాముల హైడ్రో గంజాయిని కొనుగోలు చేసి ఏలూరుకు తీసుకువస్తూ మార్గం మధ్యలో కాజా టోల్ ప్లాజా విక్రయిస్తుండగా గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్క గ్రాము గంజాయి రూ.700 కొని రూ.1500కు విక్రయిస్తున్నారని తెలిపారు.వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు,హైడ్రో గంజాయితోపాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని వారు తెలిపారు.గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్,సిబ్బందినీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.
Comments
Post a Comment