శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా 9వ వార్షికోత్సవ వేడుకలు...దాసరి మోహన్,ఆలయ అధ్యక్షులు..
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు.సమాచారం తెలుసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని,ఆలయ కమిటీ బృందానికి సహకరించారు.ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.విజయ్ కుమార్, వి.చంద్ర,వి.నరసింహులు,వి.కృష్ణ, టి.నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో ప్రతి నెల అమావాస్య,శ్రీరామ నవమి,వార్షికోత్సవం, హనుమాన్ జయంతి వంటి కార్యక్రమాలు దాతల సహకారంతో జరుపుతున్నట్లు చెప్పారు.ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు,ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిదంగా ఈ నెల 27న అమావాస్య,మే నెల 22న హనుమాన్ జయంతి కార్యక్రమాలు కూడా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సాయంత్రం భజన భక్తబృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ స్థానిక భక్తులు,ప్రజలు, భజన భక్త బృందం పాల్గొన్నారు.
Comments
Post a Comment