ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు...సీఎం చంద్రబాబు నాయుడు...

VS9TV న్యూస్,ఏలూరు ప్రతినిధి :

సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా, ఆగిరి పల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.ఎవరైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరిరోజు అని హెచ్చరిస్తున్నా అని అన్నారు.మహిళలను గౌరవప్రదంగా బతక నివ్వాలని,చేతనైతే విలువలు నేర్పించాలన్నారు.వైఎస్ భారతిపై చేసిన అసభ్య వ్యాఖ్యల సందర్భంలో చంద్రబాబు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శం..సమానత్వం మానవతా విలువలు పూలే సొంతం అన్నారు. బీసీలు టీడీపీకి వెన్నెముక,జిల్లాల వారీగా బీసీల అభివృద్ధికి ముందుకు వెళుతున్నామన్నారు.ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి..నేను పవన్ కల్యాణ్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాం...జీరో పవార్టీ వినూత్న కార్యకమం...పి4 కోసం తెలుగులో పేరు వెతికాం.కానీ,దొరకలేదన్నారు. సమాజంలో ఎంతో మంది గొప్పవారు అయ్యారు.ఆగిరిపల్లిలో 206కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.మార్గదర్శిలు వచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలి.ఆగిరిపల్లిలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాధ్యత జిల్లా కలెక్టర్ యంత్రాంగం తీసుకోవాలన్నారు.విద్యుత్‌ మరుగుదొడ్లు,మంచినీరు ఇలా అన్ని అంశాల్లో జిల్లా యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సూచించారు.ఇక, ఆగిరిపల్లిలో పి4లో భాగంగా కొన్ని కుటుంబాల బాధ్యతలను నూజివీడు సీడ్స్ అధినేతకు ప్రభాకర్ కు అప్పగించారు.అనంతరం ఆగిరిపల్లి మండలం,వడ్లమానులో పర్యటించారు. కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకు వెళ్లారు.కులవృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సీఎం..కోటయ్య పశువుల పాకను పరిశీలించారు.గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...