జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిబా ఫూలే సంఘసంస్కర్త,కుల వ్యతిరేక కార్యకర్త,ఆలోచనాపరుడు,విద్య మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, అంటరానితనం,కులవ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారన్నారు.సామాజిక సమానత్వం, మహిళా సాధికారత,విద్యను పెంపొందించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు నారాయణ,సోమశేఖర్ నాయక్,ఆర్ ఎస్సైలు,ఎఆర్ పోలీసులు పాల్గొన్నారు.
Comments
Post a Comment