శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సర్వస్వం త్యాగం చేసిన అవుట్ సోర్సింగ్ లస్కర్లు పర్మినెంట్ చేయాలి...ఔట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం...
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సర్వస్వం త్యాగం చేసిన అవుట్ సోర్సింగ్ లస్కర్లు తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం ఔట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జల మండలి నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సర్వీస్ 62సంవత్సరాలు చేయాలని, తమ మరణం అనంతరం ఉద్యోగాలు తమ పిల్లలకు ఇచ్చేందుకు వీలు కల్పించాలని కోరుతూ నినదించారు.ఫ్ల కార్డులు చేతబట్టి సాగిన ర్యాలీ నగర పౌరులను ఆకర్షించింది.ఈ సందర్భంగా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభను ఉద్దేశించి సంఘం అధ్యక్షులు జి.నాగన్న మాట్లాడుతూ జీఓ వచ్చి 40సంవత్సరాలు అయినా నేటికీ అమలు కాకపోవడం దురదృష్టమని వాపోయారు.జీఓ ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి దివంగత నేత ఎన్టీ రామారావు ప్రభుత్వం అన్నారు.అప్పటి నుంచి నేటి వరకు పాలించిన ప్రభుత్వాలు తమను మోసం చేశారని ఆవేదన చెందారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఓ అమలు చేసి,పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చి,తమ కుటుంబాలను ఆదుకుని,న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీలు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. తమకు పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు.సభ అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓకు అందజేశారు.
Comments
Post a Comment