ప్రతి కుటుంబం నుండి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలి...నాగ శివ లీల,మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్...
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలోని న్యూ కౌన్సిల్ హాల్ నందు 2025-26 సంవత్సరంకుగాను మెప్మా కార్యక్రమాలుపై కర్నూలు,గూడూరుకు సంబంధించిన రిసోర్స్ పర్సన్ లకు గురువారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆద్వర్యంలో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నాగ శివ లీల మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక సారి (అనగా జూన్,8th,సెప్టెంబర్,8th, డిసెంబర్,8th,మార్చ్,8th) మనకు ఇచ్చిన టార్గెట్ లు తప్పక పూర్తి చేయడం తో పాటు గ్రూప్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.నూతన జీవనోపాధి యూనిట్ ల ఏర్పాటులో భాగంగా వారికి రుణాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఆ ఋణంతో వారు ఏ యూనిట్ ను ప్రారంభిస్తున్నారు అనే విషయాలు పూర్తిగా తెలియచేయాలనీ పేర్కొన్నారు.అదే విధంగా ఏప్రిల్,15వ తేది నుండి బ్యాంక్ రుణాలు అన్ని కూడా ఆన్లైన్ లో అర్ పీ లాగిన్ లో రిక్వెస్ట్ చేయాలని,వాటిని సిఓ,సిఎంఎం,పిడి లాగిన్ లో అప్రూవల్ ఇవ్వడం ఇచ్చిన వెంటనే సంబంధిత బ్యాంక్ కు వెళుతుందన్నారు.ఆ తర్వాత బ్యాంక్ వారు లాగిన్ లో చెక్ చేసుకొని రుణాలు మంజూరు చేస్తారు.ఈ విధంగా చేయడం వలన అనర్హుల శాతం పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు.ఈ శ్రమ్ కు సంబంధించి అందరూ అర్ పిలకు లాగిన్ లు ఇవ్వడం జరుగుతుంది.మన గ్రూప్స్ లో ఉండే అందరూ సభ్యులు,వారి కుటుంబ సభ్యులను రిజిస్టర్ చేయాలని చెప్పారు.స్వచ్ఛ సర్వేక్షన్ కు సంబంధించి ప్రతి అర్ పి వారి పరిధిలో ఉన్న అందరూ సభ్యులతో ఫీడ్ బ్యాక్ అప్డేట్ చేయించాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకట లక్ష్మి,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి,టిఈలు, టియంసిలు సుధాకర్, భారతి,వీరారెడ్డి,సి ఓలు,అర్ పిలు పాల్గొన్నారు.
Comments
Post a Comment