తప్పిపోయిన ఇద్దరు యువతుల ఆచూకీ గుర్తించిన తాడేపల్లి పోలీసులు...
VS9TV న్యూస్,తాడేపల్లి క్రైం :
ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతాం అన్న భయంతో ఇల్లు వదిలి వెళ్లిన ఇద్దరు యువతలు వెళ్లిన 24గంటల్లోపు మైనర్ బాలికలను తాడేపల్లి పోలీసులు ఆచూకీ గుర్తించి,కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. వివరాలు...విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తాడేపల్లి,పెద్ద వడ్లపూడిలో నివాసముండే అన్నదమ్ముల కుమార్తెలు కనపడటం లేదు అని కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీసులు ఆశ్రయించారు.వారి పిర్యాదు మేరకు
సమాచారం అందుకున్న పోలీసులు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులో వారిని అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులకి ఇరువురు పిల్లలను అప్పజెప్పారు. తమ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరటంతో ఆనందభాష్పాలతో పోలీసులకు కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ కేసు చేదనలో కృషి చేసిన సిఐ కళ్యాణ్ రాజు,ఎస్ ఐ ఖాజావలి,సిబ్బంది ని ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Post a Comment