జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ...
VS9TV న్యూస్,అమరావతి క్రైం :
జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది.
కడప జిల్లాలో 417హెక్టార్ల సున్నపు రాయి గనులను అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్కు లీజు కిచ్చింది.ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ గతంలోనే ఆరోపించింది.జగన్తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు సీబీఐ 2013లో ఛార్జిషీట్ దాఖలు చేసింది.తద్వారా జగన్ సుమారు రూ.150కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు అందులో పేర్కొంది.రఘురామ్ సిమెంట్స్లో రూ.95కోట్ల విలువైన షేర్లు, రూ.55కోట్లు హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు అభియోగం మోపింది.సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.తాజాగా రూ.793 కోట్ల విలువైన అస్తులను అటాచ్ చేసింది.
Comments
Post a Comment