కొత్త జీవనోపాధి యూనిట్స్ ఏర్పాటు చేసుకొని ఆదాయ వనరులు పెంపొందించుకోవాలి... భాస్కర్ రెడ్డి,మెప్మా సిటీ మిషన్ మేనేజర్...
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరం,అజిమొద్దిన్ నగర్ లో తస్లీమా పొదుపు లక్ష్మి గ్రూప్ వారు తయారు చేసే డిష్ వాష్ పౌడర్,ఫినాయిల్,సోప్ లు మార్కెటింగ్ కొరకు ఏర్పాటు చేసిన షాప్ ను ఇండియన్ బ్రాంచ్ మేనేజర్,మెప్మా సిటీ మిషన్ మేనేజర్,ఐద్వా రాష్ట్ర ఉప అధ్యక్షురాలు గురువారం ప్రారంభించారు.ఈ సంధర్బంగా గ్రూప్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్ మేనేజర్ వారు మాట్లాడుతూ తస్లీమా గ్రూప్ సభ్యులు అందరూ కలిసి గ్రూప్ యాక్టివిటీ చేసువడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇటువంటి చిరు వ్యాపార సంస్థలను ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇతర సభ్యులు కూడా యూనిట్స్ ఏర్పాటుకు ముందుకురావాలని తెలియ
చేశారు.
మెప్మా సిటీ మిషన్ మేనేజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అర్హత ఉన్న అన్ని గ్రూప్ లకు సంబంధిత బ్యాంక్ లలో సుమారు రూ.20లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఋణం తీసుకున్న ప్రతి సభ్యురాలు ఏదో ఒక యూనిట్ ఏర్పాటు చేసుకొని వారి కుటుంబ ఆదాయం పెంచు కోవాలని ఆయన తెలియచేశారు.ఈ కార్యక్ర మంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, స్వరాజ్యం పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు పద్మ,గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment