మురుగు కాలువల్లో వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవు...డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి...
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలోని మురుగు కాలువల్లో మురుగునీరు కాకుండా వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవని నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ కే.విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బంగారు పేటలోని ఓ హోటల్ నిర్వాహకులు కొంతకాలంగా వ్యర్థాలను మురుగు కాలువలో వేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో గురువారం సంబంధిత హోటల్ నిర్వాహకులకు ప్రజారోగ్య అధికారి నోటిసులు పంపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మురుగు కాలువల్లోకి కేవలం మురుగు నీరు మాత్రమే వెళ్లాలని, అందుకు భిన్నంగా ఏవైనా వ్యర్థాలు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.వ్యర్థాల కారణంగా మురుగు వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతుందని చెప్పారు.దీనిని నగర ప్రజలు,హోటల్ రెస్టారెంట్లు,మాంసపు దుకాణదారులు, ఇతరత్రా అన్ని వాణిజ్య సముదాయాల దుకాణదారులు గ్రహించి,నగరపాలక సంస్థకు సహకరించాలని ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.
Comments
Post a Comment