ఇంటర్మీడియట్ పరీక్షల్లో చరిత్ర సృష్టించిన కేజీబీవీ విద్యార్థినులు... పి.రంజిత్ బాషా, కలెక్టర్,జిల్లా మేజిస్ట్రేట్...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు జిల్లాకు గర్వకారణమైన సందర్భంలో కర్నూలు జిల్లా కలెక్టర్,జిల్లా మేజిస్ట్రేట్ పీ.రంజిత్ బాషా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీలు) విద్యార్థినులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో చరిత్ర సృష్టించారని అన్నారు.సోమవారం మూడు కేజీబీవీ విద్యార్థినులు వారి అద్భుతమైన విజయాలను జరుపుకునేందుకు కలెక్టర్ ని కలిసి అభినందనలు పొందారు.పంచలింగాల కేజీబీవీకి చెందిన టి.మానస (992), గూడూరుకు చెందిన యు.సునిత (983), ఓర్వకల్ కేజీబీవీకి చెందిన బి.హరీత (913)మార్కులు సాధించారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యార్థినులను ఘనంగా సన్మానిస్తూ,వారి కృషిని, పట్టుదల,విద్యా ప్రతిభను ప్రశంసించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ఫలితాలు వారి ప్రతి ఘటన శీలతకు,నాణ్యమైన విద్య శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పేదరికం ప్రతిభకు అడ్డుకాదు అని పేర్కొంటూ ప్రతిభావంతులైన విద్యార్థినులకు జిల్లా పరిపాలన సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. వారు అధిక ఆశయాలతో ముందుకు సాగాలని,అదే పట్టుదలతో వారి ప్రయాణాన్ని కొనసాగించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు. కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థులతో సమానంగా ఈ విద్యార్థినులు ప్రదర్శన చూపడం నిజంగా విశేషమైన విషయం అని ఆయన పేర్కొన్నారు.ఇది జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడుతున్నాయని సూచిస్తుంది.ఈ విద్యార్థినులకు 2025, ఏప్రిల్,15న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక సన్షైన్ స్టార్ అవార్డులు అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విజయం జిల్లాలోని ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా నిలిచేలా చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.వారు విద్యా ప్రావీణ్యంతో మరింత అధికంగా విద్యార్థులు రాణించాలని వారు ఆకాంక్షించారు.
Comments
Post a Comment