డ్రోన్ కెమెరాతో ట్రాఫిక్ పరిశీలన...ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి...
కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తు న్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఈ మేరకు ఆదివారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కర్నూలు పట్టణంలో పోలీసులు డ్రోన్లతో నిఘా పటిష్టం చేశారు.నగరంలోని ట్రాఫిక్ ను పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ట్రాఫిక్ ను పరిశీలించారు.ఈ సందర్బంగా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ...నిబంధనలు పాటించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు.ఓవర్ స్పీడ్,సెల్ఫోన్ డ్రైవింగ్,త్రిబుల్ డ్రైవింగ్,రాంగ్ రూట్ డ్రైవింగ్లను గుర్తిస్తామన్నారు.
ప్రధాన సర్కిళ్లతోపాటు ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంత్రాలలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు.ప్రధాన రహదారులు, కూడళ్లు,వివిధ కాలనీల్లోని వాహనాల రాకపోకలు,ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రధాన దృష్టి సారిస్తున్నామన్నారు.
Comments
Post a Comment