సెస్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న నిధులను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించాలి...వల్లూరు శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
సెస్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న నిధులను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ అన్నారు.ఆదివారం స్థానిక ఎస్టియు భవన్ లో,అరసం జిల్లా అధ్యక్షులు కలం ప్రహ్లాద అధ్యక్షతన గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక సదస్సు ఏర్పాటుచేశారు.
సదస్సుకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ... స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించడానికి,సామాజిక స్పృహను పెంచడానికి,మానవీయ విలువలను పెంపొందించడానికి,అశాస్త్రీయ భావాలను తొలగించడానికి ప్రజలకు అవగాహన కలిగించడంలో గ్రంధాలయ ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.నేడు గ్రంథాలయాలు ఆదరణకు నోచుకోక నిర్వీర్యమైన స్థితిలో ఉన్నాయని ఆవేదన చెందారు.గ్రామ గ్రామాన గ్రంథాలయాలను పునరుద్దరించాలని,ఖాళీగా ఉన్న గ్రంథాలయ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్, 27వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.ఈ సదస్సుకు భాషా సాహితీ అభిమానులు అందరూ రావాలని పిలుపునిచ్చారు. చంద్రశేఖర కల్కురా,జే.ఎస్.ఆర్.కే శర్మలు మాట్లాడుతూ గ్రంథాలయాల పునరుద్ధరణకు అన్ని భాషాసాహితీ సామాజిక సంస్థలు ఒకే తాటిపై నిలబడి పోరాడాలన్నారు.ఊరూరా విజ్ఞానాన్ని పంచుతూ కళకళలాడిన గ్రంథాలయాలు నేడు కనుమరుగైపోవడం చాలా విచారకరమన్నారు.గ్రంథాలయాల అభివృద్ధికి చేయబోయే పోరాటంలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలు అందుకున్న డాక్టర్ ఎం.హరికిషన్,ఎస్.డి.వి.అజీజ్,జిల్లా ఉగాది పురస్కారం అందుకున్న దాసరి వెంకటరమణను అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి,పుస్తకాలను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ఎం హరికిషన్,మారుతి పౌరోహితం,ఎస్.డి.వి.అజీజ్,డీఎస్పీ మహబూబాషా,ఇనయతుల్లా,కొత్తపల్లి సత్యనారాయణ, ప్రమోద్ చక్రవర్తి,ఆదవాని హనుమంతప్ప,బాలశౌరి,చక్రపాణి యాదవ్,రాణి,లీలావతి,చంద్రమౌళిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment