అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు,అన్నదానం...దాసరి మోహన్,ఆలయ కమిటీ చైర్మన్...
అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి
ఆలయంలో ప్రత్యేకపూజలు,అన్నదానం
దాసరి మోహన్,ఆలయ కమిటీ చైర్మన్
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆల యంలో అమావాస్య పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్ర మం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి మోహన్ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.వి జయ్ కుమార్,వి.చంద్ర,వి.నరసింహులు,వి.కృష్ణ,టి.నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో దా తల సహకారంతో ప్రతినెల అమావాస్య,హనుమాన్ జయంతి,శ్రీరామనవమి పర్వ దినాల లో ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు.అదేవిధంగా ఈ అ మావాస్య నందు ఆలయం పూజారి విరుపాక్షయ్య ప్రత్యేక పూజల తరువాత మల్లెల గో త్రం,కీ.శే.టి.పెద్ద రంగయ్య,టి.సుభద్రమ్మ,టి.ఉమాకాంత్,టి.స్నేహలత,టి.పునీత్ అక్షయ్, టి.రాధిక,టి.రేవంత్ సాయిలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
ఆలయంలో జరుపుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు,ప్రజలకు ఆయన కృ తజ్ఞతలు తెలియచేశారు.అనంతరం దాతలు టి.సుభద్రమ్మ,టి.ఉమాకాంత్ లను ఆలయ కమిటీ బృందం శాలువా,పూలమాలతో ఘనంగా సత్కరించారు.అలాగే సాయంత్రం భజ న భక్త బృందం భజన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ భజన భక్త బృందం,భక్తులు,ప్రజలు పాల్గొన్నారు.

Comments
Post a Comment