యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు 

11మందిపై దేశ ద్రోహం కేసు

VS9TV న్యూస్,న్యూ డిల్లీ :

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు...తమ స్వార్థం కోసం తల్లిలాంటి దేశానికి ద్రో హం చేస్తున్న వాళ్లు ఎక్కువయిపోయారు.యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలుపెడితే... ఇప్పటి వరకు పాక్ కోసం పని చేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారులు బయట పడ్డారు.భారత్,పాక్ యుద్ధం తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు,ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు.వీరంతా హర్యానా,పంజాబ్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావ టం గమనార్హం.ఆ 11 మంది గురించి వివరాల్లోకి వెళితే...

1) జ్యోతి మల్హోత్రా : జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిసర్.33 ఏళ్ళ జ్యోతికి సోష ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది.ఆ పరిచయంతో పాకిస్తా న్ కోసం గూఢాచారిగా పని చేయటం మొదలెట్టింది.

2) దేవేంద్ర సింగ్ దిల్హన్ : పంజాబ్‌లోని మస్త్‌ఘర్‌కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పా టియాలలోని ఖల్స కాలేజీలో ఎమ్‌ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.కొన్నేళ్ల క్రితం ఇత డికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ‌లతో పరిచయం అయింది. అప్పటినుంచి భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడు.మే 12వ తేదీన తన ఫేస్‌బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నుల ఫొటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు.పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పని చేసినట్లు ఒ ప్పుకున్నాడు.

3) తారిఖ్ : తారిఖ్‌ది హర్యానాలోని కంగర్కా గ్రామం. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు,కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి.

4) అర్మన్ : 23 ఏళ్ల అర్మన్ భారత్,పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారత దేశానికి సం బంధించిన విషయాలను పాకిస్తాన్‌కు చేరవేశాడు. హర్యానాలోని నోహ్‌లో ఇతడ్ని అరెస్ట్ చేశారు.

5) నౌమన్ ఇల్లహి : 24 ఏళ్ల నౌమన్ ఇల్లహిది ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా.నౌమన్ హ ర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.ఇతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం పెట్టుకున్నాడు.పాకిస్తాన్‌కు సమాచారం అందించిన ప్రతీసారి డబ్బులు వచ్చేవి.అవి అతడి బావమరిది అకౌంట్‌లో పడేవి.

6) షహజాద్ : ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన షహజాద్ పాకిస్తాన్,భారత్ సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమ రావాణా చేస్తుంటాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు.దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడు.దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతడ్ని అరెస్ట్ చేసింది.

7) మహ్మద్ ముర్తాజా అలీ : మహ్మద్ ముర్తాజా అలీ పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐతో కలి సి పని చేస్తున్నాడు.పాకిస్తాన్ కోసం పని చేయటం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్‌ను తయారు చేశాడు.గుజరాత్ పోలీసులు ఇతడ్ని అరెస్ట్ చేశారు.

8) గజాలా : పంజాబ్‌కు చెందిన ఈమె పాకిస్తాన్‌కు డబ్బులు చేరవేస్తూ ఉండేది.ఈమెది పంజాబ్‌లోని మలెర్‌కోట్ల.

9) యామిన్ మహ్మద్ : పాకిస్తాన్ ఇతడ్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసు కుంది.ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

10) సుఖ్‌ప్రీత్ సింగ్ : పంజాబ్లోని గుర్‌దాస్‌పూర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్‌ను పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పని చేస్తున్నట్లు గుర్తించారు.పంజాబ్ పోలీసులు ఇతడ్ని అరెస్ట్ చే శారు.

11) కరన్‌బీర్ సింగ్ : పంజాబ్‌కు చెందిన కరన్‌బీర్ సింగ్‌కు నేరుగా ఐఎస్ఐతోటే సం బంధాలు ఉన్నాయి.ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవే సినట్లు తేలింది.పంజాబ్ పోలీసులు గుర్‌దాసపూర్‌లో ఇతడ్ని అరెస్ట్ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...