విజయవాడలో రోహింగ్యాల కలకలం...పోలీసుల అదుపులో 15మంది...
విజయవాడలో రోహింగ్యాల కలకలంపోలీసుల అదుపులో 15 మందిహైదరాబాద్ నుంచి వచ్చి తాడిగడపలో నివాసంవివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పని
VS9TV న్యూస్,విజయవాడ క్రైం :
విజయవాడ శివారులోని తాడిగడపలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో విజయ వాడ టాస్క్ఫోర్స్ పోలీసులు నగర శివారులోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి మొ త్తం 15మంది అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని విజయవాడకు తరలించారు.వివరాలు...తాడిగడపలోని ఓ ఇంటిని శుక్రవారం ఉదయాన్నే పోలీసులు చుట్టుముట్టారు.ఆ ఇంట్లో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.వారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? వారి కోసం ఎవరెవరు వస్తు న్నారు? అని ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. తనకు పరిచయస్థుడైన ఓ వ్యక్తి ఆటోనగర్లో భవనం నిర్మిస్తున్నానని, అక్కడ పని చేస్తున్న ఓ మహిళకు,పురుషుడి కి పోర్షన్ అద్దెకు కావాలని కోరడంతో ఈనెల 9న అద్దెకు ఇచ్చానని యజమాని తెలిపా రు.అయితే ఆమె గత ఆదివారమే వెళ్లిపోయింది.పురుషుడు ఒక్కడే ఉంటున్నాడని,గురు వారం అర్ధరాత్రి దాటాక మరో ఏడుగురు యువకులు వచ్చి ఆ ఇంట్లో ఆశ్రయం పొందారని తేలింది.మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదే క్రమంలో తాడిగడప 100అడుగుల రోడ్డులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తున్న ఇద్దరిని,గోశా ల వద్ద ఓ అపార్ట్మెంట్ పనుల కోసం వచ్చిన ఐదుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.వీరు గత ఆరు నెలలుగా ఇక్కడే పని చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారిం చారు.
పూర్వాపరాలపై విచారణ :
మయన్మార్ నుంచి అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన వీరు కొంతకాలంగా హైదరాబా ద్లో నివాసం ఉంటున్నారు.అక్కడి నుంచి విజయవాడ చేరుకొని భవన నిర్మాణ కార్మికు లుగా పని చేస్తున్నారు.వీరందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు,కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.వారికి ఎలాంటి తీవ్రవాద మూలాలు లేవని ప్రాథమికంగా నిర్ధారణ కు వచ్చారు.వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఉన్నతాధికారుల తో చర్చలు జరుపుతున్నారు.వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్లో నివసిస్తుంటారు. కానీ అక్కడ సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకుగానూ లక్షలాది రోహిం గ్యాలు 2017లో బంగ్లాదేశ్కు తరలిపోయారు.మయన్మార్లో సైనిక తిరుగుబాటు అనం తరం వారి వలసలు మరింత పెరిగాయి.దీంతో దక్షిణ బంగ్లాదేశ్లోని శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి.అక్కడి పరిస్థితులూ క్షీణించడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయేందుకు వలసబాట పడుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు మన దేశానికి అక్రమం గా వలస వచ్చి పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.

Comments
Post a Comment