జపాన్ తో కాదు...చైనాతో పోటీ పడండి...జూన్,2న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు విజయవంతం చేయాలి...కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి...
జపాన్ తో కాదు...చైనాతో పోటీ పడండి
జూన్,2న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు విజయవంతం చేయాలి
కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
భారతదేశం ఆర్థికంగా జపాన్ దేశం కంటే ముందుందని మోడీ అధికారంలోకి వచ్చిన త రువాత భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని దేశాలతో పోల్చుకుంటే భారతదేశం జిడిపి జపాన్ కంటే ముందుందని ఎన్డీఏ బాగస్వాములులైన సీఎం చంద్రబా బునాయుడు,డిప్యూటి సీఎం పవన్ కళ్యాన్ లు పీఎం మోడీని పొగడ్తలతో ముంచెత్తుతు న్నారని,జపాన్ తో కాదు,ప్రపంచంలో రెండస్థానంలో ఉన్న చైనాతో పోటీ పడాలని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.మంగళవారం సీఆర్ భవన్ లో సీపీఐ రా ష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ.రామచంద్రయ్య,జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్యలతో కలసి ఆ యన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జపాన్ జ నాభా 12.30కోట్లు,భారతదేశ జనాభా 146 కోట్ల ఉందన్నారు.జపాన్ దేశ జిడిపి 4.1 86 ట్రిలియన్ కాగా భారతదేశ జీడీపీ 4.187 ట్రిలియన్ ఉందని జనాభా ప్రకారం 134 కోట్ల జనాభా ఎక్కువగా ఉన్న మన జీడీపీకి వారి జీడీపీకి వ్యత్యాసం చాలా తక్కువగా ఉందన్నారు.అదే భారతదేశంలో 1947లో స్వాతంత్ర్యం వచ్చింది.చైనాకు 1948లో స్వా తంత్య్రం వచ్చిందన్నారు.1987వరకు ఇరుదేశాల సమానంగా ఉన్నా నేడు చైనా ప్రపం చంలోనే అమెరికా తరువాత రెండవ స్థానంలో 19.23శాతం ఆర్థిక అభివృద్ధి సాధించిం దన్నారు.చైనాతో పోటి పడకుండా జపాన్ తో పోటీ పడటం ఏమిటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబునాయుడు కూడా మోడీ భజన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార ని విమర్శించారు.భారత దేశం ఏవిషయంలో అభివృద్ధి సాధించిందో చెప్పాలని ప్రశ్నిం చారు.2014మోడీ అధికారంలోకి వచ్చినపుడు భారత దేశం అప్పు రూ.84లక్ష కోట్లు కా గా ప్రస్తుతం రూ.224లక్షల కోట్లుకు పెరిగిందన్నారు.మోడీ అధికారంలోకి వచ్చిన తరువా త నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారా ? దేశంలో నిరుద్యోగం తగ్గించారా ? విదే శాల్లో ఉన్న నల్లడబ్బులు తెచ్చారా అని ప్రశ్నించారు.పాకిస్తాన్ తో ఎందుకు యుద్ధం విర మించారో సమాదానం చెప్పాలన్నారు.అమెరికా అధ్యక్షులు ట్రంప్ చెపితే యుద్ధం విరమి స్తారా అని దేశ పరువు ప్రతిష్టలు దిగజార్చారన్నారు.గతంలో పాకిస్తాన్ తో యుద్ధం సమ యంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ,మన్మోహన్ సింగ్ అమెరికా మధ్యవర్తిత్వంను ఏ మాత్రం లెక్కచేయకుండా వ్యతిరేఖించారన్నారు.సీఎం చంద్రబాబునాయుడు వైఖరి మా ర్చుకోవాలని ఈ విషయంపై డిబెట్ కు రావాలన్నారు.పవన్ కళ్యాన్ జమిలీ ఎన్నికలపై త మిళనాడులోని డీఎంకేతో మాట్లాడతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు.రాష్ట్రంలో కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా నేటికి సూపర్ సిక్స్ అమ లు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఎన్నికలల్లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్ల స్థలం,పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని,ఇంటి నిర్మాణంకు 5లక్షలు ఇవ్వాలని,రైతులకు ఇస్తామన్న పెట్టుబ డి కేంద్రంతోకలిపి రూ.20వేలు వారి ఖాతాలో జమచేయాలని,గిట్టుబాటు ధరలు కల్పిం చాలని జూన్, 2వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళన కార్యక్ర మాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహా య కార్యదర్శి ఎస్.మునెప్ప,జిల్లా కార్యవర్గ సభ్యులు కె.జగన్నాధం,జీ.చంద్రశేఖర్,నగర సహాయ కార్యదర్శలు సి.మహేష్,డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment